Alcohol: మన భారత దేశంలో ఎన్నో సంస్కృతులు మరెన్నో సంప్రదాయాలు. ఒక్కో ప్రాంతం లో ఒక్కో ఆచారం కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మరియు మద్యం, ఈ రెండు ఒకే చోట ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ రోజు మనం అలాంటి ఒక ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ దేవుడు మరియు మద్యం ఈ రెండు పదాలు ఒకే చోట వినబడతాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో, ఖిస్ప్రా నది ఒడ్డున ఉన్న కాల భైరవ్ ఆలయంలో ప్రసాదం రూపంలో మద్యం అందించే సంప్రదాయం ఉంది. సుమారు 6000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని విశేషం ఏమిటంటే, కాల భైరవుడు ఇక్కడ మద్యం సేవించడం. అవును… మీరు విన్నది నిజమే!
ఈ ఆలయాన్ని వామ్ మార్గ తాంత్రిక ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వైన్లు, మాంసం, బలిదానం మరియు కరెన్సీని దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కాల భైరవ ఆలయంలో విగ్రహం ముఖద్వారం దగ్గర కప్పులలో వైన్ ని నింపి నివేదన చేస్తారు. ఆతరువాత కప్పు లో వైన్ ఖాళీ అవుతుంది. దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి చాలా సంవత్సరాల క్రితం ఒక ఆంగ్ల అధికారి విగ్రహం చుట్టూ చాలా త్రవ్వకాలు జరిపినట్లు సమాచారం, కాని అతడు ఈ ప్రయోగం లో విఫలం అయ్యాడట. అతనికి ఏమీ లభించలేదు మరియు ఇంకొక విషయం ఏమిటంటే అతనే కాల భైరవుడికి భక్తుడు అయ్యాడు.
పురాతన కాలంలో, తాంత్రికాలు మాత్రమే ఇక్కడకు వచ్చేవారు. తరువాత ఈ ఆలయంలోకి సాధారణ ప్రజలకు సైతం అనుమతించారు. క్రమంగా, ఈ ప్రదేశంలో బలి వ్యవస్థను కూడా రద్దు చేసి, కాల భైరవుడికి మద్యం నివేదన చెయ్యడం మొదలు పెట్టారు. శతాబ్దాల నాటి ఈ మద్యం నివేదన ఆచారం అసలు ఎవరు ప్రారంభించారనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు.