బిగ్ బాస్ సీజన్ 4 పై ముందు నుండీ ఎందుకో ఆసక్తి చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతమున్న కరోనా ప్రభావం నేపధ్యమో, మరొకటో కానీ బిగ్ బాస్ పై ఆసక్తి సన్నగిల్లింది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఈసారి భారీ ఎత్తున అత్యంత ఖర్చుతో బిగ్ బాస్ సీజన్ 4 ను మొదలుపెట్టింది.
ప్రతీసారి కంటే భిన్నంగా ఈసారి సెట్ ను నిర్మించారు. బిగ్ బాస్ కు వచ్చిన కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా మంది పెదవి విరిచారు. చాలా మంది ఎవరికీ తేలేకపోవడంతో ఆడియన్స్ నుండి అసంతృప్తి వ్యక్తమైంది. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ షో నెమ్మదిగా జనాలకు ఎక్కుతోంది. కంటెస్టెంట్స్ విషయంలో జనాలు ఒక అభిప్రాయానికి వస్తున్నారు.
ఇక షో ను రక్తి కట్టించడం కోసం బిగ్ బాస్ యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కమెడియన్స్ కుమార్ సాయి, జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కరాటే కళ్యాణి ఎలిమినేషన్ జరిగింది. గంగవ్వ సేవ్ అయింది.
ఇంకా నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. నోయెల్, అలేఖ్య హారిక, సోహైల్, అభిజీత్, అమ్మ రాజశేఖర్, మోనాల్, కుమార్ సాయి నామినేషన్స్ లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈరోజు సండే ఎపిసోడ్ లో అలేఖ్య హారికను ఎలిమినేట్ చేసారు. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆమెను ఎలిమినేట్ చేయలేదు. అది ఫేక్ ఎలిమినేషన్. ఆమెను సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు. లాస్ట్ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ కు ఇదే జరిగింది. మళ్ళీ ఇదే ఫార్ములాను ఇప్పుడు అమలు చేస్తున్నారు. మరి ఈ స్టెప్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.