Breaking: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీలోని స్కూళ్లు తెరుచుకున్నాయి. అన్ని సంస్థల ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లి పనులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కార్ పలు నిర్ణయాలను తీసుకుంటోంది. అందులో భాగంగా బుధవారం నుండి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, సచివాలయాల్లో కచ్చితంగా ప్రతి ఉద్యోగి కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలను ఇచ్చారు. ఇకపై ఏపీలోని ప్రతి ఉద్యోగి కూడా బయోమెట్రిక్ వేసి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. తక్షణమే ఇటువంటి చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఉద్యోగుల భద్రత రీత్యా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
FLASH NEWS: వ్యాక్సిన్ కోసం వాట్సాప్ లో ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి – వెంటనే స్లాట్ బుక్ చేస్తారు.