SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన SBI తన కస్టమర్లకు అలర్ట్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎస్బీఐ యంత్రాంగం ముందుంటుంది. లేటెస్ట్ అప్డేట్స్తో పాటు, సైబర్ నేరాల గురించిన జాగ్రత్తలను కస్టమర్లకు వివరిస్తుంటుంది. అందుకోసం సోషల్ మీడియా (social media) ద్వారా కూడా సేవలను అందిస్తోంది. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నందున తమ కస్టమర్లు ఎవరూ మోసకుండా ఉండేందుకు ఏటీఎం విత్ డ్రా నిబంధనల్లో మార్పులు చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ రూల్ (rule) ప్రకారం ఇకపై ఏటీఎంలో (atm) డబ్బులు డ్రా చేయాలంటే OTPని తప్పనిసరి చేసింది. ఇలా చేయడం ద్వారా కస్టమర్లకు సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ ఏర్పడుతుందని భావించింది.
SBI: ఎస్బీఐ కీలక నిర్ణయం… డిసెంబర్ 1 నుంచి ఆ సేవలు బంద్ ..!
పది వేలలోపు ఓటీపీ అవసరమా..?
ఎస్బీఐ తాజా నిబంధనల ప్రకారం కస్టమర్లు ఏటీఎం వెళ్లినప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే డబ్బులు విత్ డ్రా అవుతాయి. లేకపోతే డబ్బులు తీసుకోలేము. దీని ద్వారా సైబర్ నేరగాళ్ల (cyber crime) బారిన పడకుండా ఉండవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. ఇందులో రూ.10 వేల లోపు డబ్బులు డ్రా చేసుకుంటే ఓటీపీ అవసరం లేదు. పది వేల పైన డబ్బులు తీసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఓటీపీ అవసరం అవుతుంది.
SBI: స్టేట్ బ్యాంక్ బంపర్ స్కీం రూ. 342 కట్టి 4 లక్షలకు పొందొచ్చు తెలుసుకోండి ఇలా….!
ఓటీపీ ప్రాసెస్ ఎలా ఉంటుంది..
ఎస్బీఐ కస్టమర్ ఏటీఎం సెంటర్కు వెళ్లినపుడు డెబిట్ కార్డుతో పాటు రిజిస్టర్ మొబైల్ నెంబర్ వెంట ఉంచుకోవాలి. మొదట కార్డును ఏటీఎంలో ఇన్సర్ట్ చేయగానే వ్యాలిడ్ పిన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డబ్బులు ఎంత అవసరమో ఎంటర్ చేయాలి. రూ. పదివేల పైన మనీ డ్రా చేస్తే.. బ్యాంకు నుంచి మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ (otp)వస్తుంది.
SBI: ఎస్బీఐలో అకౌంట్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే..!
అది ఏటీఎంలో ఎంటర్ చేశాకే డబ్బు మిషిన్ నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ మొబైల్ నెంబర్కు ఓటీపీ రాకపోయినా, మన దగ్గర నెంబర్ లేకపోయినా డబ్బులు తీసుకోలేము. ఇలా ప్రతీ లావాదేవీకి ఓటీపీ అడుగుతుంది. దీనివలన ఖాతాదారుడి నగదుకు ఎలాంటి రిస్క్ ఉండదు.