SBI: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్ల డబ్బుల కోసం బ్యాంకులు ఎన్ని రక్షణ చర్యలు చేపడుతున్నా కానీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. వారి నుంచి బ్యాంకు కస్టమర్లకు మరింత రక్షణ కల్పించేందుకు భారత అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ వినూత్న ఆలోచన చేసింది. ఎస్బీఐ చేసిన ఆలోచన ప్రకారంగా కస్టమర్లకు మరింత భద్రత రావడం గ్యారంటీ. వారు తమ డబ్బుల విషయంలో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఉండొచ్చు. ఎస్బీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్ పై అవగాహన కలిగి ఉండడం వలన డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండవచ్చు.
SBI: SBI వినియోగదారులకు అలెర్ట్… ఆ సర్వీస్ లో మార్పులు …!
రూ. 10 వేలకు మించితే…
ఎస్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్ ప్రకారంగా రూ. 10 వేలకు మించిన నగదు లావాదేవీలను ఏటీఎంలలో చేసేందుకు కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇకపై రూ. 10 వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఎవరైనా ఎస్బీఐ కస్టమర్లు ఏటీఎంలలో నుంచి తీసుకుంటే వెంటనే వారి నెంబర్ కు ఒక ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) వస్తుంది. ఆ ఓటీపీని గనుక మనం ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే మన డబ్బులు విత్ డ్రా అయి మన చేతికి వస్తాయి. లేకుంటే మన డబ్బులు అకౌంట్ నుంచి విత్ డ్రా కావు.
SBI: ఎస్బీఐ కీలక నిర్ణయం… డిసెంబర్ 1 నుంచి ఆ సేవలు బంద్ ..!
వారికి అవసరం లేదు…
ఏటీఎంకు పోయే ప్రతి ఒక్కరూ రూ. 10 వేల కన్నా ఎక్కువ డబ్బులు తీస్తారనే గ్యారంటీ లేదు. ఎవరో కొంత మంది తక్కువ మొత్తంలో డబ్బులు తీస్తారు. అటువంటి వారికి ఈ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని ఎస్బీఐ పేర్కొంది. ఈ ఓటీపీ సిస్టమ్ అనేది మీరు వ్యాక్సిన్ వేసుకోవడం వలన కలిగే సురక్షా కవచం వంటిదని ఎస్బీఐ పేర్కొంది. జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లకు సూచించింది.