New cars: రోజు రోజుకీ వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో పాటుగా మనిషికి ఎక్కడలేని రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో గాని మనం చూసుకుంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కాలుష్యం గురించి మనకి తెలియంది కాదు. అక్కడ విస్తరిస్తున్న కాలుష్యానికి లాక్ డౌన్ వేసే పరిస్థితి దాపురించింది. మేటర్ కారు గురించి అనుకుంటే, వీడేమిటి.. కాలుష్యం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? అదిగో.. అక్కడికే వస్తున్నా!
AP Govt: ఆన్ లైన్ సినిమా టికెట్ల కై జీవో 142 జారీ చేసిన ఏపి సర్కార్..!!
కొత్తకార్ల కహానీ..
కొత్త కార్లు.. అవే ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీలు). ఇవి వాతావరణానికి మేలు చేయడమే కాకుండా.. వాహనదారులకు డబ్బుని కూడా పెద్ద మొత్తంలో ఆదా చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్ ధరలు కూడా సగటు మనిషికి పెను భారంగా మారుతున్నాయి. దాంతో అందరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పైన మొగ్గు చూపుతున్నారు. అలాగే ఇవి సరసమైన ధరలలో కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. అందువలనే సామాన్య మానవుడు కూడా వీటిపైన మొగ్గు చూపుతున్నాడు. దాంతో మార్కెట్లో వీటికి చాలా డిమాండ్ ఏర్పడింది.
Dry Grapes: ఎండు ద్రాక్ష తో చర్మాన్ని మెరిపించచ్చు..!!
బెనిఫిట్స్, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనేవాళ్లను ప్రస్తుతం ఎంకరేజ్ చేస్తోంది. వారికి కొనుగోళ్లపై పన్ను మినహాయింపు అందిస్తోంది. సెక్షన్ 80EEB కింద సుమారు రూ.లక్షన్నర వరకు పన్ను మినహాయింపును అఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికిల్ సేల్స్ బాగానే పెరుగుతున్నాయి. ప్రజలలో అవగాహన పెరగడం వలన వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. వారి అవసరాలకు, టేస్టులకు తగ్గట్టు కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడల్స్ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. ఇండివిడ్యువల్స్కు మాత్రమే ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించగలరు. అలాగే ఎలక్ట్రిక్ వెహికిల్ను ఫైనాన్సింగ్తో పాటుగా కొనుగోలు చేసే వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది.