Anasuya: కొన్ని సినిమాలు అనూహ్యంగా అందులో నటించిన నటి నటులకు ఇమేజ్, క్రేజ్ తెస్తాయి.దీంతో వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంది.
అయితే మరికొన్ని సినిమాలు విడుదల కాకముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్నా రిలీజ్ అయ్యాక నటీనటులను ఉసూరుమనిపించిన ఘటనలూ ఉంటాయి.ఎందుకు ప్రముఖ టీవీ యాంకర్ కం సినీ నటి అనసూయ భరద్వాజే నిదర్శనం.
Anasuya: రంగమ్మత్త గా చెరగని ముద్ర!
అనసూయ భరద్వాజ్ మెగా పవర్ హీరో రాం చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ కి ఎంతో ప్లస్ అయింది.విపరీతమైన పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.నిజానికి ఆ సినిమాలో అనసూయకు అంత మంచి పాత్ర ఉందని విడుదలకు ముందు ఎవరికీ తెలియదు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన రంగస్థలం సినిమాలో హీరోకి ఎంత పేరు వచ్చిందో,అనసూయకూ అంతే పేరు వచ్చింది.ఇప్పటికే ఆమెను రంగమ్మత్త అనే ముద్దుగా పిలుచుకుంటారు.
ఆశలు వమ్ము చేసిన పుష్ప!
వెనువెంటనే సుకుమార్,అల్లుఅర్జున్ కాంబినేషన్ లో తాజాగా వచ్చిన పుష్ప మూవీలో దాక్షాయణి అనే కీలకపాత్రకు అనసూయ ఎంపికవటంతో ఆమె రేంజ్ ఇంకా పెరిగి పోతుందని అందరూ ఊహించారు.దానికి తోడు అనసూయ అని గుర్తు కూడా పట్టలేని విధంగా అతి క్రూరమైన గెటప్ లో దాక్షాయణి పాత్రలో ఆమెను చూపిస్తూ సుకుమార్ విడుదల చేసిన పోస్టింగులు ఇంకా ఆసక్తిని రేపాయి.
Anasuya: గెటప్ లో బిల్డప్ తప్ప ఏమీ లేని దాక్షాయణి!
కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే పుష్ప లో అనసూయ పాత్రకు ప్రాధాన్యం లేదు.అతి కొద్ది సేపే ఆమె ఈ సినిమాలో కనిపిస్తుంది.దాక్షాయణి గా ఆమె గెటప్ కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించ లేదు.మేకప్ లో క్రూరత్వం కనిపించిందే తప్ప ఆమె నటనలో అదంతగా ఎక్స్పోజ్ కాలేదన్న విమర్శలు ఉన్నాయి.ఈ సినిమాపై వచ్చిన టాప్ వెబ్ సైట్ రివ్యూల్లో కూడా అనసూయ పాత్ర ప్రస్తావన ఏమాత్రం లేకపోవటం ఇక్కడ గమనార్హం.రంగస్థలం సినిమా అప్పుడు రాం చరణ్ తో పాటు రంగమ్మత్త పాత్ర పై కూడా అద్భుతమైన రివ్యూలు రావడం కూడా మనం గమనించాలి.
రెండోపార్ట్ తో రేంజ్ పెరుగుతుందట!
అయితే పుష్ప రెండో పార్ట్ లో అనసూయ పాత్ర కి ప్రాధాన్యం ఉంటుందని,నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడిప్పుడు వార్తలు వస్తున్నాయి.ఇది నిజమైతే తప్ప అనసూయకు పుష్ప మొదటి పార్ట్ లో జరిగిన డ్యామేజ్ భర్తీ కాదని సినీ పండితులే చెప్తున్నారు.మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి.