ఆర్ ఎక్స్ 100 వంటి సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అన్నంత పేరు సంపాదించుకున్నాడు. కాని రెండవ సినిమా కోసం రెండేళ్ళ పైనే ఎదురు చూస్తూ ముప్ప తిప్పలు పడ్డాడు. ‘మహా సముద్రం’ అన్న సినిమా కోసం అజయ్ భూపతి ముందు మాస్ మహారాజ రవితేజ చుట్టూ తిరిగాడు. ముందు ఎస్ అన్న రవితేజ తర్వాత నో చెప్పాడు. తర్వాత అక్కినేని నాగచైతన్య తో ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుందన్న వార్తలు వచ్చాయి. కాని నాగ చైతన్య కూడా డ్రాపయ్యాడు. ఎట్టకేలకి ఈ సినిమా ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ తో సెట్ అయింది. తాజాగా అధికారక ప్రకటన కూడా వచ్చింది.
మొత్తానికి ఇక ‘మహా సముద్రం’ లేనట్టే అనుకున్న అందరికీ షాకిచ్చాడు. ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్ళడమే లేట్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దార్థ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడన్న టాక్ ఉంది.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా వెల్లడించ లేదు. అదితీ రావు హైదరీ, దివ్యాంశ కౌశిక్, అనుపమ పరమేశ్వరణ్ ల పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మజిలీ సినిమాలో చైతుకు జోడిగా ఫస్టాఫ్ లో నటించి మెప్పించిన ‘దివ్యాంశ కౌశిక్’ దాదాపు కన్ఫర్మ్ అన్న సమాచారం.
ఇక ఈ సినిమా నుంచి వారానికో అప్డేట్స్ ఇస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి త్వరలో ఈ సినిమాలో నటించబోతున్న మరో హీరో..అలాగే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ప్రాజెక్ట్ లో ఉన్న అందరిని రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఇక వరస ఫ్లాపులమీదున్న శర్వానంద్ ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు.