pray the god: 12 రాశులలో జన్మించిన వారు ఏ రాశి ప్రకారం ఏ దేవుడికి తాంబూలం సమర్పించి మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాధలు శాంతిస్తాయి.
మేష రాశి లో పుట్టిన వారు మంగళవారం తాంబూలంలో మామిడి పండ్లు పెట్టి కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది.
వృషభ రాశి లో పుట్టిన వారు మంగళవారం తమలపాకులు మిరియాలు పెట్టి రాహువును ప్రార్ధిస్తే కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయి.
మిథున రాశి లో పుట్టిన వారు బుధవారం నాడు తమలపాకులో అరటిపళ్ళను పెట్టి ఇష్టదేవతా పూజ చేసుకోవడం వలన అనుకున్న పనులు జరుగుతాయి.
కర్కాటక రాశి లో పుట్టిన వారు,శుక్రవారం తమలపాకులో దానిమ్మ పండు పెట్టి కాళీమాతను వేడుకుంటే కష్టాలు తొలగిపోతాయి.
సింహ రాశి లో పుట్టిన వారు గురువారం తమలపాకులో అరటిపండు పెట్టి ఇష్టదేవతా పూజ చేసుకుంటే అన్ని విధాలా మంచి జరుగుతుంది.
కన్యారాశిలో పుట్టిన వారు గురువారం రోజు తమలపాకులో మిరియాలు పెట్టి ఇష్టదేవతా పూజ చేయడం వలన దుఃఖం దరి చేరదు.
తులా రాశి లో పుట్టిన వారు శుక్రవారం రోజు తమలపాకులో లవంగం ని పెట్టి ఇష్టదేవతను ప్రార్ధిస్తే అనుకున్న కార్యాలు అన్ని సక్రమంగా జరుగుతాయి.
వృశ్చిక రాశి లో పుట్టిన వారు,మంగళవారం రోజు తమలపాకులో ఖర్జూర పండ్లు పెట్టి ఇష్టదేవతను ప్రార్ధిస్తే అన్ని రకాల బాధలు తగ్గుతాయి.
ధనుస్సు రాశి లో పుట్టిన వారు, గురువారం రోజు తమలపాకులో కలకండను పెట్టి ఇష్ట దేవతను పూజిస్తే సుఖసంతోషాలు పొందగలుగుతారు.
మకర రాశి లో పుట్టిన వారు, శనివారం తమలపాకులో బెల్లం ముక్క పెట్టి కాళీ మాతను పూజించి ప్రార్ధిస్తే కష్టాలు తీరుతాయి.
కుంభ రాశి లో పుట్టిన వారు శనివారం రోజు తమలపాకులో నెయ్యిని పెట్టి కాళీమాతను ప్రార్ధిస్తే దుఃఖాలు తగ్గుతాయి.
మీన రాశి లో పుట్టిన వారు, ఆదివారం తమలపాకు లో పంచదార పెట్టి ఇష్టదేవతను పూజించడం వలన సుఖసంతోషాలు పొందుతారు.
పూజ అయిన తర్వాత ఈ తాంబూలం ని మీరు తిన్న లేదా ఆవుకి తినిపించిన పర్వాలేదు. పరిహారం మీరు ఎన్ని సార్లు చేసుకుంటే అంత ఫలితం పొందుతారు .