Vizag steel plant : రాజకీయ పార్టీల పోరాటాలు ఎప్పుడూ అధికార ఆరాటం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా విషయం మీద పో రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది అంటే ఖచ్చితంగా అది సాధించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే పోరాటం మొదలు పెడుతుంది. అంతేగాని అసలు సాధ్యం కానీ, పరిష్కారం కాని సమస్యలను రాజకీయ పార్టీలు ఎప్పుడూ పోరాటాలు ఎంచుకోవు. ఎందుకంటే ఆ పోరాటం విఫలమైతే ఆ రాజకీయ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ Vizag steel plant ప్రైవేటీకరణ మీద రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల ధోరణి ప్రమాదకరంగా తయారవుతుంది.
** ఏ సమస్యకైనా రాజకీయాలు ముడిపడి ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించడం దాదాపు అసాధ్యం. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటంలోనూ ఎన్నో రాజకీయాలు ఉన్నాయి. పైకి కనిపించే కొన్ని అయితే దాని వెనుక జరుగుతున్న తతంగం చాలా పెద్దది.
** రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా పోరాటం తీసుకొని, కార్మిక సంఘాల మద్దతుతో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం మొదలు పెడితే దానికి కేంద్రం కదులుతుందా..?? రాజకీయ పార్టీల పోరాటాన్ని రాష్ట్ర ప్రయోజనాల ఆరాటాన్ని గుర్తిస్తుంద అంటే దానికి సమాధానం లేదు. అంటే రాష్ట్రంలో ఎన్ని రోజులు పోరాటం చేసినా దానిని కేంద్రం ఖచ్చితంగా పట్టించుకుంటుంది అన్నది ధీమా లేదు.
** కేంద్రం, బిజెపికి వ్యతిరేకంగా పోరాడే సత్తా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ముఖ్యంగా మోడీ అమిత్ షా అంటే వల్లమాలిన గౌరవం కంటే బీభత్సమైన భయం అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఉంది. అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేసులు ఇతరాత్రా వ్యవహారాలపై భయపడితే, చంద్రబాబు సైతం ఓటుకు నోటు కేసు తో పాటు పార్టీ మనుగడ పూర్తిగా నాశనం అయిపోతుంది అనే కోణంలో మోడీ అమిత్ షా తో ఇప్పుడు గొడవపడి అందుకు సిద్ధంగా లేరు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం బిజెపి మద్దతుతో రాజకీయాలు చేయాలని భావిస్తున్న తరుణంలో కేంద్రాన్ని అడిగేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఇక వామపక్షాలు వాయిస్ ను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ పరిస్థితి చెప్పక్కరలేదు.
** కేంద్రం పూర్తిగా తన ఆధీనంలో ఉన్న అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా అమ్మేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇది బీజేపీ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం. దీనిలో భాగంగా ఇప్పటికే 11 పెద్ద ప్లాంట్లను, సంస్థలను అమ్మేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వంతు వచ్చింది. అందులోనూ నష్టాలను సాకుగా చూపిస్తూ దానిని వదిలించుకునేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న సరే దాన్ని అమ్మకుండా ఉండరు అనే మాట తప్పు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని సంస్థలను అమ్మేయడం ద్వారా భారీగా నిధులను సేకరించే లక్ష్యంతో బీజేపీ ఉంది. కాబట్టి దాదాపు ఒక్కో సమస్యను కేంద్రం అమ్మేసి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.
** ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని దేశంలోని అన్ని సంస్థానాలను క్రమంగా ప్రైవేటీకరణ చేయాలన్నది బిజెపి టార్గెట్. దీనిలో భాగంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సంస్థలను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో కనీసం బీజేపీ కు సంస్థాగతమైన బలం కూడా లేదు. అధికారానికి దగ్గరలో రావడం అన్నది కల. మరి ఎలాంటి బలం లేని ఆంధ్రప్రదేశ్లో దేనికి లోబడి బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వెనక్కు తగ్గుతుంది..?? ఇక్కడ వారికి కనీసం రాజకీయ ప్రయోజనాలు ఆశించే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు బిజెపి స్టీల్ ప్లాంట్ విషయంలో పురాణాలు జుట్టు ఉంది అనుకోవడం భ్రమ.
** రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి అంతా తాత్కాలికం. ఖచ్చితంగా స్టీల్ప్లాంట్ విషయంలో బిజెపి వెనక్కి తగ్గుతుంది అని ఎవరూ అనుకోవడం లేదు. పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలకు ఇది తెలుసు. అయితే తమ మీదకు వ్యవహారం రాకూడదనే రీతిలో, రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినకూడదని కోణంలో , ప్రజా వ్యతిరేకత తమ పార్టీ మీద పడకూడదు అన్న రీతిలో మాత్రమే పోరాటాలకు రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతే తప్ప లేఖల వల్ల గానీ ప్రధానిని ప్రత్యక్షంగా కలిసి చెప్పడం వల్ల గాని ప్రయోజనం ఉంటుందని అనుకోవడం పిచ్చితనం. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గొడవ లో చివరకు వెర్రి వాళ్లు అయ్యేది జనం మాత్రమే. ఎందుకంటే ఈ పోరాటాలు ఆరాటాలు జనం ఎన్నికల సమయానికి మర్చిపోతారు. మళ్లీ యధావిధిగా ఆ వారం రోజుల సెంటిమెంటు మాత్రమే ఓటింగ్ వద్దకు వచ్చేసరికి పనిచేస్తుంది. పాత విషయాలు మర్చిపోవడం ప్రజలకు బాగా అలవాటు. అందులో ఆంధ్ర ప్రజలు ప్రతి రోజు ఈ మరిచిపోయే విషయంలో గోల్డ్ మెడలిస్ట్ లు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?