Samantha: సమంత.. ఓ మంచి నటి మాత్రమే కాదు. సమాజ సేవలోను ముందుండి అందరికీ చేయూతగా ఉంటుంది. అందుకేనేమో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అక్కినేని వారి కోడలు అయ్యింది. అయితే కొన్ని కారణాల చేత తాజాగా చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. దాని తరువాత అందరూ ఆమెకు అవకాశాలు తగ్గుతాయేమో అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆమె అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
Janasena Bjp: బీజేపీ గురించి పవన్ ఆలోచించాల్సిందేనా..? ఏం జరుగుతోంది..!!
Samantha: తాజాగా ఆమె చేసిన పోస్టు సారాంశము ఇదే..
విడాకుల అనంతరం ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. గత కొన్ని వారాలుగా మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తుంది. అలాగే సద్గురు జగ్గీ వాసుదేవ్ మాట్లాడిన మోటివేషన్ కోట్స్ వీడియోస్ షేర్ చేస్తుంది. ఇకపోతే తను చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా సమంత తన ఇన్ స్టా ఖాతాలో మరో పోస్ట్ చేసింది. దాని సారాంశం ఇదే.. “ఓకే యూనివర్స్! ఇక మంచిని తీసుకునేందుకు, ఫీల్ అయ్యేందుకు నేను రెడీగా ఉన్నాను. నేను మంచిగా ఫీల్ అయ్యేటట్టు చేయడం నీపని!” అంటూ సమంత చెప్పుకొచ్చింది.
Janasena Bjp: బీజేపీ గురించి పవన్ ఆలోచించాల్సిందేనా..? ఏం జరుగుతోంది..!!
సమంత అంతరంగం ఇదే మరి!
ఇక సామ్ చేసిన పోస్ట్ చూసిన వారికి ఆమె అంతరంగం ఖచ్చితంగా అర్ధం అవుతుంది. ఈ ఏడాది తనకంతా మంచి జరగాలని ఆమె కోరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో యశోధ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసినదే కదా. ఇక ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత.