నాచురల్ స్టార్ నాని వరుస చిత్రాల షుటింగ్ జరుపుకుంటూ మంది ఊపు మీద ఉన్నాడు. మంచి సబ్జెక్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ తన కెరీర్ ను చాలా బాగా మలుచుకున్నాడు. వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించి యువ దర్శకులను కూడా బాగా ప్రోత్సహిస్తున్నాడు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఆనందపరచడమే లక్ష్యంగా ఎంటర్టైన్మెంట్ పూర్తిగా నిండి ఉండే కమర్షియల్ చిత్రాలు కూడా చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం దాని శ్యామ్ సింగ్ రాయ్ అనే చిత్రంతో పాటు సుందరానికి తొందరెక్కువ అనే మరొక ఆసక్తికరమైన సినిమాలలో బిజీగా ఉన్నాడు. అదేపనిగా ‘టక్ జగదీష్’ రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు.
మామూలుగా టక్ జగదీష్ ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే మిగిలిన సినిమాల పోస్ట్ప్రొడక్షన్ ఆలస్యం కావడం లైన్ లో ఏ సినిమాలు లేకపోవడం చూసి ఈ సినిమా మార్చి 11న విడుదలకు అవకాశం ఉందని అనేక కథనాలు వచ్చాయి. ఇక గత ఏడాది నాని తీసిన చిత్రం ‘వి’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. టక్ జగదీష్ ను ఎలాగైనా శివ రాత్రికి రిలీజ్ చేసి కలెక్షన్లు కొల్లగొట్టాలని నాని భావించాడు. అయితే అదే తేదీన మరొక మూడు చిత్రాలు వస్తుండడంతో అసలైన గేమ్ మొదలైంది.
ముందు అసలు మార్చి 11 తేదీ ని ఫిక్స్ చేసుకుంది నాని కావడం గమనార్హం. అయితే ఒకేసారిగా మహాశివరాత్రి సందర్భంగా శర్వానంద్ నటించిన శ్రీకారం, నవీన్ పోలిశెట్టి-రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి నటించిన జాతి రత్నాలు, శ్రీ విష్ణు హీరోగా గాలి సాంపత్ కూడా ఇదే రోజున విడుదల కానున్నాయి. ముందు ఒక సినిమా ప్రకటించగానే వెంటనే మరొక సినిమా ఆ తర్వాత ఇంకొక సినిమా కూడా విడుదలకు సిద్ధం అయిపోయింది. ఇదే రోజు ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూడు సినిమాలకు పోటీ వెళితే థియేటర్లను సమానంగా పొందడం సాధ్యం కానందున మిగిలినవారు ఇక తమ సినిమా విదుదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. టక్ జగదీష్ కి దర్శకత్వం శివ నిర్వాణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక టక్ జగదీష్ కూడా ఇదే రోజున విడుదల చేయాలని ఫిక్స్ అయిన తర్వాత ఇలా సడెన్ గా మూడు సినిమాలు ఆ డేట్ ను ఫిక్స్ చేసేసుకోవడం 50% సీట్లు మాత్రమే అమ్మడానికి వీలు ఉండడంతో నాని ఇక ఆ ఆలోచన విరమించుకోవాల్సిందే అని తెలుస్తోంది.