JIO : విపణిలోకి వచ్చిన నాటి నుంచి డిఫరెంట్ ప్లాన్లతో దూసుకుపోతున్న దిగ్గజ టెలికం సంస్థ జియోకు భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడు చూసుకున్నా కానీ కస్టమర్లు పెరగడమే తప్పా జియోకు కస్టమర్లు తగ్గారనే వార్త వినిపించలేదు. కానీ జియో విషయంలో మొదటి సారి కస్టమర్లు తగ్గారు. అదేదో వందో, వేయో, లక్షో అనుకుంటే పొరపాటే. జియో ఏకంగా కోట్లలో కస్టమర్లను కోల్పోయింది.
Ys Jagan: గిరిజన విద్యార్థుల కోసం jio సంస్థతో కలిసి జగన్ ప్రభుత్వం కీలక అడుగులు..!!
ఇదే తొలిసారి..
జియో ఇండియా తన కస్టమర్లను కోల్పోవడం ఇదే తొలిసారి. ఆ కంపెనీ 1.90 కోట్ల మంది తమ కస్టమర్లను కోల్పోయింది. అసలు ఎందుకిలా జరిగిందనే విషయం మీద జియో ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో తన సమీప పోటీదారు అయిన భారతీ ఎయిర్టెల్ మాత్రం 2.74 లక్షల మంది కొత్త కస్టమర్లను ఆకర్షించింది. దీంతో జియోకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కొత్తగా చేరిన వారితో ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 35.44 కోట్లకు చేరుకుంది.
Reliance Jio: ప్రపంచంలోనే అత్యంత చవకైన “జియో నెక్స్ట్” స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూసేయండి..
ట్రాయ్ చెప్పిన విషయాలివే..
భారత్ లో ఎటువంటి టెలికం కార్యకలాపాలు జరగాలన్నా కానీ ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ) చాలా ముఖ్యం. రీసెంట్ గా ఆ ట్రాయ్ చెప్పిన విషయాలను ఒక్కసారి పరిగణలోనికి తీసుకుంటే జియోకు ఎంత భారీ షాక్ తగిలిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెంబర్ వన్ గా కొనసాగుతున్న జియో కు 1.90 కోట్ల మంది కస్టమర్లు గుడ్ బై చెప్పారు. దీంతో జియోకు ప్రస్తుతం ఉన్న కస్టమర్ల సంఖ్య 42.48 కోట్లకు చేరుకుంది. అలాగే భారతీ ఎయిర్టెల్ లో కొత్తగా 2.74 లక్షల మంది చేరడంతో దాని కస్టమర్ల సంఖ్య 35.44 కోట్లకు చేరుకుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా నుంచి 10.77 లక్షల మంది కస్టమర్లు వెళ్లిపోయారు. ఇది ఆ కంపెనీకి పెద్ద దెబ్బే. 1.90 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయినా కానీ జియో ఇండియా మాత్రం టాప్ లోనే కొనసాగడం విశేషం. ఈ విషయంలో జియోను దెబ్బతీసేందుకు పోటీ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.