ఆషాఢం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. తొలిఏకాదశి, తర్వాత దక్షిణాయనం. దీనిలో దక్షిణాయనం అనేది గ్రహ గతులకు, ఖగోళానికి సంబంధించిన విషయం.
ఈ సమయంలో సూర్యుడి గమనం పై తర్వాత ఆరునెలలు ఆయా కాలాలో మార్పులు వస్తాయి. ఈ మాసంలో సూర్యుడితో ఎవరు ఎవరు ప్రయాణిస్తారు. వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం… ఆషాఢ మాసంలో సూర్యభగవానుడు ‘అరుణుడు’ (వరుణుడు) పేరుతో పయనిస్తాడు. అప్పుడు మహర్షి వసిష్ఠుడు, యక్షుడు ‘సహజన్యుడు’, అప్సరస ‘రంభ’, గంధర్యుడు ‘హుహూ’, సర్పం ‘శుక్రుడు’, రాక్షసుడైన ‘చిత్రస్వనుడు’- వరుణాదిత్యునితో ఉంటారు.
భగవానుడు రథంపై ఆసీనుడై, కిరణకాంతులతో తేజరిల్లుతాడు. కాలస్వరూపుడు, అత్యంత ప్రతాపశాలి, కామరూపుడైన అరుణ (వరుణ) దేవుని నేను ఉపాసిస్తాను. ఈ అరుణ (వరుణ) ఆదిత్యుడు ఐదువేల కిరణాలతో ప్రకాశిస్తూ, శ్యామ వర్ణంతో విలసిల్లుతాడు. ఇలా అనేక విశేషాలు మన పెద్దలు చెప్పారు. వాటి గురించి పరిశోధన చేస్తే ఈ కాలంలో వచ్చే కిరణాలలోని సూక్ష్మాతిసక్ష్మమైన మార్పులు రకాలు మనకు గోచరిస్తాయి. ఓం నమో సూర్యనారాయణాయనమః.