ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా యాప్ మీద బాగా ఫోకస్ పెట్టారు. సినిమా రేంజ్ లో ఈ యాప్ మీద కాన్సన్స్ట్రేషన్ చేస్తున్నారు. భవిష్యత్తు ఓటీటీ ప్లాట్ ఫాం దే అన్న ఉద్దేశ్యంతో అర్జెంటుగా అమెజాన్..నెట్ఫ్లిక్స్ రేంజ్ కి ఆహా ని తీసుకురావాలని అల్లు అరవింద్ ప్లాన్. చెప్పాలంటే వాళ్ళనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మనకి మాత్రం ఏం తక్కువ మనం ఓటీటీలో మన సినిమాలను రిలీజ్ చేసేయొచ్చు అన్నదే అల్లు అరవింద్ స్టాటజీ.
అందుకే రీసెంట్ గా కృష్ణ అండ్ హిస్ లీల అన్న సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా బాగానే పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఇకపై వరసగా కొన్ని సినిమాలని ఆహా ద్వారా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ ఆ సినిమాలని స్వయంగా ప్రమోట్ కూడా చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని రకాల జోనర్స్ లో వెబ్ సిరీస్ ని చిన్న సినిమాలని నిర్మించాలని ప్రముఖ దర్శక, రచయితలతో కథలు సిద్దం చేయిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు.
ఒక్క సినిమాలు..వెబ్ సిరీస్ మాత్రమే కాదు మరిన్ని ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంస్ ని ఆహా లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీ టాక్ ని స్టార్ట్ చేయబోతున్నారు అల్లు అరవింద్. ఈ టాక్ షో కి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హోస్ట్ గా వ్యవహరించబోతుంది. ఇక దర్శకులలో ఆసక్తి ఉన్నవారిని నిర్మాణంలో భాగస్వామిగా చేర్చుకుంటున్నారు అల్లు అరవింద్. ఇందులో భాగంగానే విరాట పర్వం సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వేణు ఉడుగుల అల్లు అరవింద్ ఆహా కోసం రూపొందిస్తున్న ఒక ప్రాజెక్ట్ కి నిర్మాతగా బాధ్యతలు అప్పగించారట. మొత్తానికి ఈ మెగా ప్రొడ్యూసర్ ఏ ఒక్కరిని వదలడం లేదు.