Allu Arjun: కరోనా సెకండ్ వేవ్ తీసుకు వచ్చిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. దేశంలో మొదటిసారి వచ్చిన దానికంటే రెండోసారి వచ్చిన మహమ్మారి చాలా మందిని బలి తీసుకోవడం జరిగింది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకూ చాలామంది కరోనా బారిన పడటం జరిగింది. దాదాపు ప్రతి ఒక్కరి ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కూడా కరోనా బారిన పడటం జరిగింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇంకా చాలా మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు.
రెండోసారి తీవ్రత అధికంగా ఉండటంతో..సినిమా షూటింగులు మొత్తం ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. జులై స్టార్టింగ్ నుండి సినిమా షూటింగులు.. స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటె జులై ఫస్ట్ వీక్ 5వ తారీఖు నుండి పుష్పా సినిమా బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి సుకుమార్ సరికొత్త షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగిందట.
Read More: Pushpa: పుష్ప లో ఎటువంటి క్యారెక్టర్ చేస్తుందో రివిల్ చేసేసిన రష్మిక మందన..!!
ఈ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన నటించనున్నట్లు సమాచారం. ఫహద్ ఫజిల్ కూడా నెక్స్ట్ షూటింగులో జాయిన్ కాబోతున్నాడట. ఈసారి కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి సుకుమార్ రెడీ అయినట్లు సమాచారం. పుష్ప ఫస్ట్ పార్ట్ ఏది ఏమైనా త్వరగా రిలీజ్ చేయాలని మరోపక్క నిర్మాతలు ఇప్పటి నుండే.. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?