Allu Arjun: మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చాలా రంగాలు ఈ మహమ్మారి కరోనా వల్ల నష్టపోయాయి. వాటిలో సినిమారంగం కూడా ఒకటి. గత ఏడాది.. ఈ ఏడాది సరిగ్గా సినిమా రంగం వ్యాపారం బాగా జరిగే టైమ్ లో.. సమ్మర్ లో… ఈ మహమ్మారి రావటం తో .. రిలీజ్ కావాల్సిన చాలా కొత్త సినిమాలు ఆగిపోయాయి. దీంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని కోట్ల బిజినెస్ వేసవికాలంలో జరగకుండా నష్టం వాట్టిలింది. కాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. దేశంలో చాలామంది మరణించడం జరిగింది.
అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు హీరోలు డైరెక్టర్లు హీరోయిన్లు కూడా కరోనా బారిన పడటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గత రెండు నెలలు దేశంలో … ఆర్తనాదాలు.. చావు కేకలు ఉన్న క్రమంలో.. ప్రభుత్వాలు చాలా వరకు ప్రజలను ఇళ్లకే పరిమితం చేయటం జరిగింది. అయితే ఇటీవల కొద్ది రోజుల నుండి దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు కరోనా నిబంధనలు సడలింపులు చేస్తూ… ఉన్నారు. దీంతో ఆగిపోయిన సినిమా షూటింగులు మళ్లీ స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.
Read More: Pushpa: “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం సుకుమార్ ని అంత పని చేయొద్దు అంటున్న ఫ్యాన్స్..??
ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమా షూటింగ్ కూడా షురూ అయింది. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జులై 5వ తారీఖు నుండి గోవాలో దాదాపు 30 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్.. ప్లాన్ చేయడం జరిగిందట. సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలు ..గోవా ప్రాంతంలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. దాదాపు ఈ షెడ్యూల్ తో.. “పుష్ప” మొదటి భాగం కంప్లీట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా..కరోనా తెచ్చినా గ్యాప్ వల్ల “పుష్ప ” మొదటి పార్ట్ మాత్రం అతి తొందరగానే రిలీజ్ చేయాలని పుష్ప టీం అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.