Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ .. చాలా శరవేగంగా జరుగుతోంది. దీనిలో భాగంగా తాజాగా పుష్ప మూవీ షూటింగ్ కోసం.. అల్లు అర్జున్ కాకినాడ రావడం జరిగింది.
ఈ క్రమంలో రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో.. ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు.. చిత్రీకరిస్తూ ఉన్న తరుణంలో గోకవరం మీదుగా వెళ్తుండగా .. రోడ్డు పక్కన ఒక చిన్న హోటల్.. అది కూడా తాటాకులతో.. ఉన్న హోటల్ లోకి అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. పొద్దున్నే వెళ్ళటంతో తో.. ఆ చిన్న హోటల్ యజమాని ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతి పెద్ద స్టార్ హీరో తన హోటల్ కి రావడంతో.. ఊహించలేకపోయాడు. ఈ క్రమంలో అల్లుఅర్జున్ హోటల్లో దోశ ఆర్డర్ చేసి.. తనతో పాటు తన సిబ్బందితో కలిసి తినడం జరిగింది.
ఇదే సమయంలో బిల్లుతో పాటు అదనంగా వెయ్యి రూపాయలు ఆ హోటల్ యజమాని కి. అల్లు అర్జున్ ఇవ్వటంతో.. ఆ హోటల్ యజమాని నమ్మలేకపోతు.. ఆశ్చర్యమైన కళ్ళతో.. అల్లు అర్జున్ ని సాగనంపాడు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో పాటు వీడియో కూడా రావడంతో అల్లు అర్జున్ అభిమానులు సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.