Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరిలో కొత్త స్థాయిని అందుకుంటున్నాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరో గా అవతరించిన ఒకే ఒక హీరో ప్రభాస్. అది కూడా రాజమౌళి ‘బాహుబలి’ సినిమా తోనే అతనికి ఆ ఘనత దక్కింది. అయితే బాహుబలి చిత్రం తర్వాత స్టార్ హీరోల సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా బయట ఇండస్ట్రీలలో వసూళ్ల సునామీ సృష్టించలేకపోయారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తం పాకి ఉంది.
బన్నీ సినిమాలు కేరళ రాష్ట్రంలో అయితే స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో రిలీజ్ అవుతాయి. తాజాగా హిందీ అభిమానులంతా అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలను యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వీక్షిస్తున్నారు. గూగుల్ లో కూడా గత సంవత్సరం అందరికన్నా మోస్ట్ సర్చెడ్ హీరో గా అల్లు అర్జున్ రికార్డు సాధించాడు. ఇలా జాతీయస్థాయిలో మంచి పేరున్న అల్లు అర్జున్ సుకుమార్ తో తీసే ‘పుష్ప’ సినిమా కూడా అందుకు తగ్గట్టే తెరకెక్కుతోంది.
బాహుబలి కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘పుష్ప’ కావడం విశేషం. ప్రభాస్ ‘సాహో’ కూడా పాన్ ఇండియా సినిమా అయినా కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇక సుకుమార్ తో చేసే ‘పుష్ప’ సినిమా మినిమం గ్యారంటీ సినిమా అని అందరూ అంటున్నారు. అందులో అల్లు అర్జున్ లుక్ అయితే అన్ని రకాల ఆడియన్స్కు తెగ నచ్చేసింది. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ మొదలు కాకముందే 180 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేశారు. ఇప్పుడు అది కాస్తా 200 కోట్లకు పైగా అవుతుందట. కానీ నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అది అల్లు అర్జున్ స్టార్ డమ్ కి ఉదాహరణ.
అతని గత సినిమా ‘అల వైకుంఠపురం లో’ ఒక రొటీన్ కథాంశంతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా బరిలోకి వచ్చి 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పింది. అసలా సినిమాకి ముందు అంతటి భారీ వసూళ్లు వస్తాయని నిర్మాతలు సైతం ఊహించలేదు అని చెప్పాలి. మాస్ ఆడియన్స్ తో పాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకులు, కుటుంబాలు కూడా అల్లు అర్జున్ సినిమాలను ఎలా ఆదరిస్తున్నారు అన్నది దీనిని బట్టి అర్థం అవుతుంది.
ప్రస్తుతం మహేష్, రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ సినిమాలు ఇండియా స్థాయిలో ఉండగా వాటన్నింటి కంటే ముందు అంతటి మార్కెట్ ఏర్పరచుకొని అల్లు అర్జున్ ‘పుష్ప’ తోనే మొదలు పెట్టేసాడు. రానున్న రోజుల్లో అల్లుఅర్జున్ ఎంతటి స్థాయికి వెళ్తాడు అనేది అతను మన ఊహకే వదిలేశాడు.