Allu arjun : 2020లో విడుదలయి టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా అల వైకుంఠపురంలో. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీపడి టాలీవుడ్ లో భారీ వసూళ్ళు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డును సాధించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఆయన సాంగ్స్ క్రియేట్ చేసే రికార్డ్స్ గురించి అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురంలో సినిమాను త్వరలో హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవంగా అయితే గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ మొదలు అవ్వాల్సింది. అయితే కరోనా కారణంగా రీమేక్ సినిమాను ఈ ఏడాది సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగు వర్షన్ లో అల్లు అర్జున్ చేసిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ రీమేక్ లో హీరోయిన్ గా కృతి సనన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
Allu arjun : తన సినిమాలో తానే ఓ గెస్ట్ రోల్ చేయడానికి ఓకే అన్నాడట.
వాస్తవంగా తెలుగు వర్షన్ లో నటించిన పూజా హెగ్డే ని హిందీలో కూడా తీసుకోవాలనుకున్నారట. కానీ ప్రస్తుతం పూజా తెలుగు, హిందీ, తమిళ సినిమాలలో భారీ ప్రాజెక్ట్స్ తో ఊపిరాడనంత బిజీగా ఉంది. దాంతో కృతి సనన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా లో వినిపిస్తున్న టాక్ అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ లో అల్లు అర్జున్ ని పది నిమిషాల గెస్ట్ అపీరియన్స్ ఇవ్వమని మేకర్స్ కోరారట. దీనికి ఆయన పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తోంది. ఆయన బాలీవుడ్ లో భారీగా మార్కెట్ ఏర్పరచుకోవాలని చూస్తున్నాడు. అందుకే తన సినిమాలో తానే ఓ గెస్ట్ రోల్ చేయడానికి ఓకే అన్నాడట.