Allu Arjun : దేశ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో సినీ అభిమానులకు తొలిసారి పరిచయం కానున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక పుష్ప తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న బన్నీ తన ఆ తరువాతి చిత్రం తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో చేస్తున్నాడని సమాచారం. తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ తెలుగు లో ‘ఏం మాయ చేశావే’ సినిమాతో ఇక్కడ ఆడియన్స్ కు బాగా పరిచయం. అంతకుముందే వెంకటేష్ తో ‘ఘర్షణ’ సినిమా కూడా తీశాడు.
గౌతమ్ ప్రేమ కథలకి తెలుగులో పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే యాక్షన్ సినిమాలను కూడా గౌతమ్ మీనన్ అదే రేంజ్లో తెరకెక్కించగలడు. ప్రస్తుతం ప్రొడక్షన్ లోకి దిగిన వాసుదేవ్ మీనన్ నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే డైరెక్టర్గా రేసులో వెనకబడిన అతను మళ్ళీ తన దర్శకత్వంపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడట. అందుకే అల్లు అర్జున్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందట, అంతకు ముందే ఎన్నో తెలుగు ప్రొడక్షన్ హౌస్ లు గౌతమ్ మీనన్ ను మన హీరోలతో సినిమా చేయమని పట్టుబట్టాయి. మరి చివరికి బన్నీతో ఇలా కుదిరింది. ఇక ఈ సినిమా కోసం మాస్ ఎలివేషన్లు గౌతమ్ కథలో ఎక్కువగా పెడుతున్నారని సమాచారం