లెక్కల మాస్టారు సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రాక్ స్టార్ దేవీ ప్రసాద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటి రష్మిక మందన్న నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండగా 5 భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతుంది. ఇక సినిమాని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అంతేకాదు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తుంది.
అయితే రష్మిక కి తన కెరీర్లోనే పుష్ప సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. పుష్పలో తనూ పోషించే పాత్ర తన సినీ జీవితంలోనే ఎప్పటికి నిలిచిపోతుందని చాలా నమ్మకంగా ఉందట. ఈ సినిమాలో రష్మిక ఓ గిరిజన యువతిగా కనిపించబోతుంది. ఇప్పటి వరకు రష్మిక చేసిన సినిమాలన్ని ఎకెత్తైతే పుష్ప మరిక ఎత్తని చెబుతుంది. ఈ సినిమాలో నటనలోని మరో కోణం బయటకు వస్తుందని రష్మిక భావిస్తుంది. అందుకే రష్మిక ఈ పాత్ర మీద ఎంతో ఆసక్తి చూపిస్తోందని చెప్పుకుంటున్నారు. ఒకరకంగా రంగ స్థలంలో సమంత పాత్ర మాదిరిగా ఉంటుందని సమాచారం.
ఇక ఈ సినిమా షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారట. అలాగే ఈ సినిమాలో ఉన్న స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
ఇక రష్మిక మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుందని వార్తలు వస్తున్నాయి. అఖిల్ అక్కినేని 5 ఇటీవల అధికారకంగా వెల్లడైన సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేదర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో రష్మిక అయితే అఖిల్ కి పర్ఫెక్ట్ పేయిర్ అని మేకర్స్ అనుకుంటున్నారట. త్వరలో ఇందుకు సంబంధించి అఫీషియల్ న్యూస్ రానుంది.