దర్శకుడు సుకుమార్ సినిమాలంటే ఒక లెక్కుంటుంది. అందుకే తన సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. సుకుమార్ సినిమాలోని హీరో పది మందిని ఒంటి చేతితో కొట్టడు కదా..? మరీ ఎందుకు ఆయనకు అంత క్రేజ్ అంటారా..? ఆయన సినిమాలు జనాల్లోనుంచి పుడతాయి. జనాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఏ డైరక్టర్ కు లేని ప్రాముఖ్యత ఆయనకు ఉంటుంది. ఆ విషయాన్ని రంగస్థలం నిరూపించింది.
రంగస్థలం సినిమాతో తన మార్కును తెలుగు సినీ ఇండస్ట్రీలో గట్టిగ వేశాడు ఈ దర్శకుడు. ఆ సినిమా తరువాత తన సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో ఎంతో జాగ్రత్తగా ఆయన మళ్లీ ఒక కొత్త ప్రాజెక్టుతో ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో యువ హీరో అల్లు అర్జున్ కథానాయకుడు. యువతలో ఆయనకు ఉన్న క్రేస్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి డైనమిక్ కాంబినేషల్ లో తెరకెక్కుతున్న చిత్రమే పుష్ప.
ఈ పుష్ప సినిమా అప్డేట్ కోసం అటు అల్లు ఫ్యాన్స్ , ఇటు సుకుమార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను తీసిన డైరెక్టర్ బన్నీతో కలిసి మూడో చిత్రాన్ని రూపొందిస్తుండటం సినీ ప్రేమికుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అనుకున్నట్లుగానే ఏప్రిల్ 8న సినిమా టైటిల్ను, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
పుష్ప అని సినిమా పేరు చూడగానే అల్లు ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోయారు. అభిమానులు, ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన ఈ సినిమాకు వచ్చింది. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా చాలా రఫ్గా ఉండటంతో అందరికీ నచ్చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గందపు చెక్కల స్మగ్లర్గా కనిపించనున్నారనే పుకార్లు రావడం మరింత చర్చకు దారితీసింది. అయితే కరోనా వల్ల ఎనిమిది నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు. దాంతో సినీ ప్రేముకుల ఆశలపై నీరు పోసినట్లు అయ్యింది. ఎప్పుడేప్పుడు పుష్ప అప్డేట్స్ వస్తాయని తెగ చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్పై రకరకాల పుకార్లు వచ్చాయి. షూటింగ్ను ఎప్పుడు, ఎక్కడ మొదలుపెడతారో తెలుసుకోవడానికి అల్లు ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు.అయితే ఈ షూటింగ్ అప్డేట్కు సంబంధించి రేపు (నవంబర్ 9న) ఉదయం 10 గంటలకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దాంతో ఎనిమిది నెలలుగా ఆగిన ప్రాజెక్ట్ మళ్లీ షూరు అయినట్లు తెలుస్తోంది. అయితే రేపు ఏం చెప్తారో.. ఎప్పుడు రీలీజ్ చేస్తారో అనే విషయాలను వినాలని సినీ ప్రేమికులు వేచిచూస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?