ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో ఎప్పటి నుంచో ఉన్న అల్లు అర్జున్ కల నెరవేర్చుకున్నాడు. అదే ఇండస్ట్రీ రికార్డ్ సాధించాలని. మాటల మాంత్రీకుడు దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ ని నెలకొల్పింది. కాగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ భావించారు.
అయితే సుకుమార్ తో ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ చేస్తాడని మాత్రం ఎవరు ఊహించలేదు. ఆ మాటకోస్తే అల్లు అర్జున్ కూడా ఈ రేంజ్ లో పుష్ప ప్రాజెక్ట్ సెట్ అవుతుందని అనుకోలేదట. సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమా చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ కి అలాంటి సినిమా చేయాలని అనుకున్నాడట. ఆ క్రమంలోనే సుకుమార్ తో రంగస్థలం లాంటి సినిమా చేద్దామని పట్టుపట్టాడట. అల్లు అర్జున్ కి ఉన్న ఈ ఆసక్తి వల్లే సుకుమార్ పుష్ప కథ రాసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ మొదలైనప్పటి నుంచి చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడట అల్లు అర్జున్.
అందుకే లాక్ డౌన్ లో కూడా అల్లు అర్జున్ ఎపుడెప్పుడు పుష్ప సెట్ లో జాయిన్ అవుతానా అన్న క్యూరియాసిటీతో ఉన్నాడట. ఎట్టకేలకి ఇటీవలే పుష్ప సినిమా సెట్స్ మీదకి వచ్చింది. అల్లు అర్జున్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. లొకేషన్ లో అల్లు అర్జున్ లుక్ కూడా ఒకటి బయటకి వచ్చి వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం కూడా అల్లు అర్జున్ కి మంచి కిక్ ఇస్తోందట. పాన్ ఇండియన్ రేంజ్ లో 5 భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు తెలుగుతో పాటు మిగతా నాలుగు భాషల్లోను అల్లు అర్జున్ తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు.