ఈ ఏడాది ప్రారంభంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో “అల వైకుంఠపురం లో” సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బన్నీ. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని బన్నీ చేసిన ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇంతలోనే కరోనా వైరస్ రావటంతో సినిమా థియేటర్లు షూటింగ్ లు మొత్తం క్లోజ్ అవడంతో… ఈ యేడాదికి అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా “అలా వైకుంఠపురం” సినిమా యే అని విశ్లేషకులు అంటున్నారు.
కాగా ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సినిమా బన్నీ ఓకే చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఉండగా ఇండస్ట్రీలో ఊర మాస్ డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి శ్రీను తో బన్నీ సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “సరైనోడు” అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బన్నీ లో ఉన్న మాస్ యాంగిల్ ని సూపర్ వోల్టేజ్ పవర్ తో చూపించాడు బోయపాటి. కాగా ఇప్పుడు అదే తరహాలో మరో సినిమా చేయడానికి బోయపాటి రెడీ అయినట్లు త్వరలోనే అల్లు అర్జున్ కి స్క్రిప్ట్ చెప్పబోతున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?