స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో భారీ సక్సస్ అందుకోవాలనుకున్నాడు. కాని ఆ సినిమా అల్లు అర్జున్ కి ఊహించని షాకిచ్చింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని మూడు నాలుగు కథలను అనుకొని ఫైనల్ గా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో కమిటయ్యాడు. ఆ సినిమానే అల వైకుంఠపురములో.
అల్లు అర్జున్ పూజా హెగ్డే హీరో, హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన అల వైకుంఠపురములో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తో పాటు మరికొన్ని సినిమాలతో పోటీ పడి ఇండస్ట్రీ రికార్డ్ ని సాధించింది. కాగా ఇంకో మూడు నెలలు అయితే అల వైకుంఠపురములో వచ్చి సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ ఈ సినిమా రికార్డ్ లూ వేట కొనసాగుతూనే ఉంది.
ఈ సినిమా మ్యూజికల్ గా భారీ సక్సస్ కావడానికి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. అల వైకుంఠపురములో ఆల్బమ్ ఇప్పుడు ఏకంగా 1.5 బిలియన్ స్ట్రీమింగ్స్ ను ఒక్క యూట్యూబ్ నుంచే అందుకొని మన సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచి కొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. ఈ సినిమా ఇలాంటి అరుదైన రికార్డు కలిగిన ఒకే ఒక్క తెలుగు అలాగే మన సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.
ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ డియా సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించాడు. కొరటాల ఆచార్య కంప్లీట్ అయ్యాకా అల్లు అర్జున్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!