అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా తెలుగు ఓటీటీ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అందుకు తగ్గట్టే అల్లు అరవింద్ కూడా ఈ ఓటీటీ ద్వారా వీలైనన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంస్ డిజైన్ చేస్తునారు. ఒక వైపు సినిమాలని ఆహా ద్వారా ప్రేక్షకుల కి అందిస్తున్నారు. అలాగే మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు వెబ్ సిరీస్ లు కూడా నిర్మాణంలో ఉన్నాయి.
బాలీవుడ్ లో కియారా అద్వాని, నేహ ధూపియా, రాధికా ఆప్టే లాంటి స్టార్స్ నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ కూడా తెలుగులో రూపొందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ లాంటి వాళ్ళు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే తమన్నా భాటియాతో ఒక టాక్ షో కూడా మొదలవబోతుంది. తాజాగా సమంత అక్కినేని తో సామ్ జామ్ అన్న ఎంటర్టైనింగ్ షో కూడా మొదలవబోతుంది. ప్రముఖ దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి ఈ షో నిర్మాతగా వ్యవహరిస్తోది.
ఇక అల్లు అర్జు కూడా ఆహా కోసం ప్రమోషనల్ యాడ్ ఫిలింస్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ యాడ్ షూట్ కంప్లీటవగా త్రివిక్రం దర్శకత్వం వహించాడు. నవంబర్ 13 నుంచి ఈ యాడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. అంతేకాదు అల్లు అర్జున్ సొంతగా ఆహా కోసం బయోపిక్స్ ని నిర్మిచాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా తాజాగా తమన్నా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది. 11th అవర్ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ను విలక్షణ దర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రవీణ్ సత్తార్ రూపొందించాడు. ఆహా మోస్ట్ బ్యూటీఫుల్ గా కనిపిస్తున్న పోస్టర్ తో వెబ్ సిరీస్ ను అధికారికంగా ఆహా మేకర్స్ అనౌన్స్ చేశారు.