అఖిల్ అక్కినేని వరసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. కాని ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. మొదటి సినిమా యంగ్ హీరో నిర్మాతగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అన్న పేరుతో వచ్చిన సంగతి తెలిసిందే. కాని ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత విక్రం కుమార్ తో హలో చేశాడు. ఈ సినిమా కూడా అఖిల్ కి పెద్దగా ఉపయోగపడింది లేదు. రెండో సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్న అఖిల్ కి నిరాశే మిగిలింది.
ఇక మూడవ సినిమాగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ఞు ఖచ్చితంగా హిట్ అని భావిస్తే అది కూడా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇలా వరసగా ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ కి హిట్ ఇవ్వాలని అల్లు అరవింద్ ప్లాన్ చేశాడు. మొదటి సినిమాకంటే తర్వాత రెండు సినిమాలలో అఖిల్ పర్ఫార్మెన్స్ పరంగా బాగా మెరుగయ్యాడు. అందుకే గీతా ఆర్ట్స్ 2 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా ని అనౌన్స్ చేశారు.
అయితే ఈ సినిమా కి ప్లస్ అంటే ఒక్క పూజా హెగ్డే మాత్రమే. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలాకాలంగా హిట్ లేదు. ఇక అఖిల్ ట్రాక్ రికార్డ్ తెలిసిందే. కాని కథ మీద నమ్మకంతో ఈ సారి భారీ హిట్ దక్కుంచుకుంటాడు అఖిల్ అనుకుంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు, వాసు వర్మ కలిసి నిర్మించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటోంది.
ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. కాని దాదాపు 35 కోట్ల వరకు బడ్జెట్ అవడంతో అంత బడ్జెట్ రికవర్ అవుతుందా అని ఆలోచిస్తున్నారట. అయితే అల్లు అరవింద్ ఈ సినిమాని ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వద్దామని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి అంటున్నారు.