ఢిల్లీ, జనవరి 8: సిబిఐ అధికారుల వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ అధికారుల అంతర్గత కలహాల నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ అయిన స్థానంలో నాగేశ్వరరావును నియమించారు. అలోక్ వర్మ, జాయింట్ డైరక్టర్ ఆస్తానల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో కేంద్రం అలోక్వర్మను ఆ పదవి నుండి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కేంద్రం ఉత్తర్వులను తప్పుబడుతూ తిరిగి ఆయనకు బాధ్యతలు అప్పగించాలని అదేశించింది. అలోక్ వర్మ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.
previous post
next post