టాలీవుడ్ లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీసింది తక్కువ సినిమాలైనా కూడా ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. రాం చరణ్ అల్లు అర్జున్ లతో ఎవడు.. నాగార్జున కార్తి లతో ఊపిరి సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి సినిమాలు తీశాడు వంశీ పైడిపల్లి. ముఖ్యంగా మహర్షి సినిమా మేకింగ్ మహేష్ బాబు కి విపరీతంగా నచ్చడంతో ఆ సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడే వంశీ పైడిపల్లి కి మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు.
ఈ ఇయర్ 2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత వాస్తవంగా మొదలవ్వాల్సిన సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే. అయితే ముందు పాయింట్ చెప్పినప్పుడు నచ్చిన కథ పూర్తి స్థాయిలో నెరేట్ చేసినప్పుడు మహేష్ బాబు కి నచ్చలేదట. అందుకే నిర్మొహమాటంగా మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం పరశు రాం తో సర్కారు వారి పాట టైటిల్ తో సినిమాని కన్ఫర్మ్ చేస్తూ ఇటీవల ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు.
దాంతో ఇక ఇప్పట్లో వంశీపైడిపల్లి సినిమా ఇండదని అందుకే వెబ్ సిరీస్ కి ప్లాన్ చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాని ఇందులో ఎంతమాత్రం నిజం లేదని ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేష్ బాబు కోసమే మరో కథ ని సిద్దం చేస్తున్నట్టు .. ఆ పనిలోనే బిజీగా ఉన్నట్టు తన సన్నిహితుల ద్వారా అందిన తాజా సమాచారం. ఇక ముందు మహేష్ బాబు కి చెప్పిన కథ రాం చరణ్ కైతే పక్కాగా సూటవుతుందని ఒకవేళ ఆ కథ చరణ్ కి నచ్చితే మహేష్ బాబు స్వయంగా నిర్మించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.