Google Maps: ఒకప్పుడు ఏదైనా తెలియని కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా కంగారుగా అడ్రస్ సరిగా తెలియక భయం భయంగా ఉండేది. కొత్త అడ్రస్ అయితే ఎవరినైనా అడుగుదాం అనుకున్నా కొన్ని సార్లు మనం వెళ్లిన ప్రదేశంలో ఎవ్వరు లేకపోతే మళ్ళి అది ఇంకొక ఇబ్బంది అయ్యేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కారణంగా ఇప్పుడు ఆ చింత లేదనే చెప్పాలి. ఎక్కడ ఏ ప్రదేశానికి అయినా చాలా ప్రశాంతంగా అరచేతిలో ఫోన్ పెట్టుకుని గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్లిపోవచ్చు. కేవలం ఒక్క క్లిక్తో భూగోళం మొత్తాన్ని మన ముందు ఉంచుతుంది ఈ గూగుల్ మ్యాప్స్.
ఈ గూగుల్ మ్యాప్స్ విదేశీ యాప్ కారణంగా చాలా మంది దేశి యాప్ అవసరం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ గూగుల్ మ్యాప్స్కు పోటీగా దేశీ యాప్ ఒకటి రూపొందుతుంది. ఈ విదేశీ యాప్ కు ప్రత్యామ్నాయంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), మ్యాప్స్ యాప్ ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఓ రెండు సంస్థల మధ్య ఒప్పందం కూడా జరిగింది.
కరోనా నేపథ్యంలో ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నందున చాలా మంది గూగుల్ మ్యాప్స్ కూడా ఇండియా సంస్థల నుంచి వస్తే బావుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో మరియు మ్యాప్ మై ఇండియా సంస్థల మ్యాప్స్ యాప్ ప్రకటన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో తెగ సందడి చేస్తున్నారు. విదేశీ యాప్స్ పరిస్థితే ఇలా ఉంటే దేశీ మ్యాప్స్ వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది అని ఫన్నీ ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంకొందరు మాత్రం ఏ యాప్ వచ్చినా గూగుల్ మ్యాప్స్ను అధిగమించలేదని చాలా కచ్చితంగా చెప్తున్నారు.