Children:కొందరి పిల్లలకు Children ఆవు పాలు తొందరగా జీర్ణం కావు. మరి కొందరికి జీర్ణమైనా రకరకాల ఎలర్జీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బర్రె పాలు, బాదం పాల విషయంలో కూడా చాలా మంది పిల్లలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి . ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు ఏ పాలు పట్టాలి అనే సందేహం వస్తుంది. అలాంటి వారికోసం రైస్ మిల్క్ ఒక మంచి ఆప్షన్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బియ్యంతో తయారు చేసే పాలలో లాక్టోస్ ఉండకపోవడం తో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. వాటిగురించి తెలుసుకుందాం…
రైస్ మిల్క్ ను బియ్యం తో తయారు చేస్తారు. బియ్యాన్ని ఉడకబెట్టి పిండిలా చేసి వాటి తో పాలను తయారు చేస్తారు. రైస్ మిల్క్ రుచి లో తీపిగా ఉన్న దీనిలో లాక్టోస్ ఉండదు. కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. పాలంటే ఎలర్జీ కలిగే పిల్లలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇతర పాలతో పోలిస్తే బియ్యం పాలు విటమిన్ బి 12 ఉండదు . మెరుగైన కొవ్వు, పోషకాహార వనరులతో బియ్యం పాల ను ప్రత్యామ్నాయంగా మార్చాలని నిపుణులు తెలియచేస్తున్నారు. రైస్ మిల్క్ లో కొలెస్ట్రాల్ లేనందున అలెర్జీ కలగకుండా చేస్తుంది . అలాగే ఇతర రకాల పాలు కంటే తియ్యగా ఉంటుంది.సులభంగా జీర్ణమయ్యేలా ఉంటాయి. ఆవు పాలు తరువాత, బియ్యం పాలలో అత్యధిక చక్కెరలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి .
అలెర్జీ ఉన్న పిల్లలకు బియ్యం పాలు సురక్షితమైనది గా చెప్పబడినది . అయితే, బియ్యం పాలు తల్లి పాల కు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఇది ఆవు పాలు లేదా బాదం పాలకు మాత్రమే ప్రత్యామ్నాయం అది కూడా డాక్టర్ల సలహా తోనే తో నే వాడాలి .
బియ్యం పాలను వాడే ముందు ఈ విషయాలను గమనించండి..బియ్యం పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండదు. దీనిలో ఇనుము ఉండదు.. అలాగే చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న పిల్లలకు ఇవ్వలేము. మీ పిల్లలకు బియ్యం పాలు ఇవ్వడం ప్రారంభించే ముందు మీ డాక్టర్స్ ని సలహా అడగడం మంచిది.