Nagarjuna: కాజల్ అగర్వాల్ వల్ల ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్కు అవకాశాలు వస్తున్నాయి. అది ప్లస్ అయినా వాడుకోవడం చేతకావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాజల్ ప్రస్తుతం గర్భవతి అని అందుకే ఆమె ఒప్పుకున్న సినిమాలను క్యాన్సిల్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఆచార్య తర్వాత తెలుగులో కాజల్ చేయాల్సిన సినిమా నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ అనే సినిమా. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్, గోవా సహా పలు విదేశాలలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగార్జున లుక్ రిలీజై ఆసక్తిని రేపింది. అయితే కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో నాగ్ సరసన హీరోయిన్ను ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇప్పటికే ఇలియానా, త్రిష, శ్రీయ లాంటి సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన చిత్రంబృందం ఇదే క్రమంలో అమలా పాల్ను కూడా సంప్రదించారట. ఆ సమయంలో ఆమె అడిగిన రెమ్యునరేషన్ విని దర్శక నిర్మాతలు షాకయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్గా వెలుగుతున్న వారి రెమ్యునరేషన్ 2 కోట్లకి పైగానే ఉంది.
Nagarjuna: కోటి ఇచ్చి అమలాను తీసుకుంటారా..లేక మరో ఆప్షన్ చూస్తారా.
ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నవారిలో పూజా హెగ్డే, రష్మిక మందన్న, సాయి పల్లవి, కీర్తి సురేశ్, తమన్నా, నయనతార ఉన్నారు. వీరి మాదిరిగానే అమలా పాల్ కూడా నాగార్జున సరసన హీరోయిన్గా నటించమని ఆఫర్ ఇస్తే కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేసిందట. ప్రస్తుతం అమలా పాల్కు ఉన్న క్రేజ్ ప్రకారం 50 లక్షలు ఎక్కువని చెప్పుకుంటున్నారు. అమలాకు టాలీవుడ్లో పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి. అయినా నాగార్జున సినిమా అంటే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అయినా ఆమె రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అని సంకేతాలు పంపిందట. చూడాలి మరి కోటి ఇచ్చి అమలాను తీసుకుంటారా..లేక మరో ఆప్షన్ చూస్తారా.