ఒకే ప్రాంతంలో అభివృద్ధి కంటే, ఉత్తరాంధ్ర పురోగతిని పేర్కొంటూ విశాఖ కార్యనిర్వహక రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
ఇందుకోసం తమకు ఎదురయ్యే సవాళ్లను సైతం అధిగమించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తోంది. ఇందుకోసం పోరాటాలు చేస్తోంది. అమరావతి జేఏసీ రూపంలో ఉద్యమాన్ని నడిపిస్తోంది. సంఘీతాభావం తెలుపుతోంది. అయితే, ఈ సమయంలో కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి.
250 రోజులు దాటిపోయినా….
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళన 250 రోజులకు చేరింది. గత కొద్దికాలంగా అమరావతి విషయంలో టీడీపీ తన గళం బలంగానే వినిపిస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వంటివారు ప్రకటలు చేస్తున్నారు. అమరావతిలో జరిగే ఆందోళనలకు పెద్దగా పార్టీ నేతల నుంచి స్పందన రావడం లేదు.
ఆ ఎమ్మెల్యేలే బాబుకు పెద్ద సమస్య?
ఏపీ రాజదాని మార్పు విషయంలో చంద్రబాబుకు ఎదురవుతున్న సమస్య విశాఖ జిల్లాలోని సిటింగ్ ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. సున్నితమైన రాజధాని వ్యవహారంలోకి దూరితే ఇబ్బంది పడటం తప్పదేమోనన్న అయోమయంలో ఉన్నారట. మూడు రాజధానుల ప్రతిపాదన సిఎం జగన్ నోటి నుంచి వెలువడిన వెంటనే విశాఖలో కదలికలు మొదలయ్యాయి. ఓ హోటల్లో టీడీపీ కీలక నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పరిస్ధితిని ఎలా డీల్ చేయాలో నిర్ణయించుకున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సహా పార్టీ ముఖ్యులు హాజరైన ఈ సమావేశం విశాఖ కార్యనిర్వహక రాజధానికే మొగ్గు చూపించిందని సమాచారం.
ఆ నలుగురే బాబుకు…
విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విశాఖ నగరంలోని నులుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు రాజధాని రాకను వ్యతిరేకించడం బొత్తిగా ఇష్టం లేదట. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారని టాక్. మరోవైపు కర్నూల్ లోనూ పూర్తి రాజధాని కావాని స్థానిక టీడీపీ సీనియర్లు బహిరంగంగా నినాదం ఇచ్చారు. ఇక విశాఖకు వచ్చే రాజధానిని ఆపితే తమ ఉనికికి కష్టమని వైజాగ్లోని టీడీపీ ఎమ్మెల్యేలు భావించడంలో ఆశ్చర్యం ఏముంది? కేవలం వీరికే కాకుండా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు కూడా రాజధానిని వ్యతిరేకించడం కష్టంగా వుందట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?