హైదరాబాద్: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ప్రకటించకపోతే ఏపీలో సినిమాలు అడ్డుకుంటామని వీరు హెచ్చరించారు. విద్యార్థుల ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.
previous post