(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్ను కలిసి రాజధాని అమరావతి ఉద్యమ కార్యచరణను వివరించి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా శైలజానాధ్ మాట్లాడుతూ మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని విభజించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ విధానాన్ని ఆయన ఖండించారు. మూడు రాజధానుల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంలో జెఏసి నాయకులు మాట్లాడుతూ శనివారం రాజధాని రైతులతో కలిసి ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోది, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్లను కలిసి అమరావతి రైతుల ఆందోళనలను, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరిస్తామన్నారు. అపాయింట్మెంట్ లభిస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ఉద్యమానికి మద్దతు కోరతామని వారు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?