అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా చూడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
జేఏసీ నేతలు ఏడు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి అమరావతి రాజధాని సమస్యను వివరిస్తున్నారు. రాజధాని అమరావతి రైతులు, మహిళలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 50 రోజులకు పైగా నిర్వహిస్తున్న ఆందోళనలను వివరిస్తున్నారు.