అమరావతి: ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జి చేసిన తీరుతో పాటు పలు విషయాలపై వారు పవన్ కల్యాణ్కు తెలిపి, తమ తరఫున పోరాడాలని కోరనున్నారు. మరోవైపు రాజధాని అంశంపై బీజేపీతో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ తీసుకున్న రాజధాని నిర్ణయం వైసీపీ వినాశనానికి నాంది అని పవన్ వ్యాఖ్యానించారు.
previous post
next post