అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నేడు హైదరబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు. ముందుగా అమరావతి పేరును రాజధానిగా ఇండియా మ్యాప్లో పెట్టేలా కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. అనంతరం రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సమస్యలు, ప్రస్తుత పరిణామాలను అన్నింటిని కిషన్ రెడ్డికి వివరించనున్నారు. రాజధాని నిర్మాణ పనులు త్వరిత గతిన ప్రారంభించేలా ఏపీ ప్రభూత్వంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.
previous post
next post