Karnataka: కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ఈమధ్య టైం బాగోలేదు అని చెప్పాలి. వారికి బాగోలేదా… లేదా విదేశీ కార్పొరేట్ కంపెనీలకు మూడిందా అన్న విషయం కూడా గమనించాల్సిందే. తాజాగా ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ కర్ణాటక ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపిన విషయం తెలిసిందే. గూగుల్ సెర్చ్ ఇంజన్లో “ప్రపంచంలోనే అతి చెత్త భాష ఏమిటి” అని టైప్ చేస్తే కింద ఆన్సర్ గా ‘కన్నడ భాష’ అని వచ్చింది.
దీనిపై పలువురు నెటిజన్లు స్పందించగా గూగుల్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయితే ఈసారి క్షమాపణలు చెప్పడం కార్పొరేట్ దిగ్గజం అయినా అమెజాన్ వంతు అయ్యేలా ఉంది. అమెజాన్ లోని కొన్ని లోదుస్తులపై కన్నడ రాష్ట్ర చిహ్నం ముద్రించి ఉండడం… వాటిని విక్రయానికి ఆ వెబ్ సైట్ లో పెట్టడం పెద్ద దుమారమే రేపింది. దీంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పైన కన్నడిగులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నడ వారి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఈ సంస్థ వ్యవహరించిన తీరు పై నిప్పులు చెరిగారు. కర్ణాటక వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా గూగుల్ వ్యవహరించడం వెంటనే అమెజాన్ లో ఇటువంటి లోదుస్తులు బయటపడడంతో ఒకసారి అందరూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు టీఎస్ నాగాభరణం స్పందిస్తూ అమెజాన్ వారు తమ రాష్ట్రాన్ని అవమానిస్తూ అమెజాన్ వారి వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. మరి అమెజాన్ కూడా ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇస్తుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఒక రాష్ట్ర చిహ్నం ఇలా లోదుస్తుల పై ముద్రించడం అనేది చాలా పెద్ద తప్పు. మరి దీనిని వారు ఎలా సర్దుదిద్దుకుంటారు అన్నది చూడాలి.