విజయవాడ, ఏప్రిల్ 17: స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైసిపి నాయకులు ఏవ్వరూ దాడి చేయలేదనీ, ఆయన పోలింగ్ బూత్ ఆక్రమణ చేయడానికి వెళితే ప్రజలే తిరగబడ్డారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ కోడేలను కాపాడాలని చూస్తే పోలీసులు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
12వ తేదీ తాము కోడెలపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిన్నటి వరకూ కేసు నమోదు చేయలేదనీ, ఉన్నతాధికారుల, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తరువాత నిన్న కేసు రిజిస్టర్ చేశారని అంబటి అన్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇనుమిట్ల గ్రామంలో కోడెల ప్రవేశించి ఘర్షణకు కారణమయ్యారని అంబటి విమర్శించారు.
కోడెల అక్కడకు వెళ్లి పోలింగ్ బూత్ ఆక్రమణకు ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డాడే తప్ప దాడికి పాల్పడలేదని అంబటి అన్నారు. కోడెలతో పాటు పోలింగ్ బూత్లోకి ఆయన గన్మెన్ వెళ్లాడని అంబటి అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి గన్మెన్ వెళ్లవచ్చా, ఏలా వెళ్లాడు అని అంబటి ప్రశ్నించారు.
పోలింగ్ బూత్లోకి వెళ్లిన గన్మెన్ను పోలీసు అధికారులు తక్షణం సస్పెండ్ చేయాలని అంబటి డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే కోడెల డ్రామాలు ఆడుతున్నారని అంబటి విమర్శించారు. నర్సరావుపేటలో ఆయన్ను తిరస్కరిండం వల్లనే సత్తెనపల్లిలో పోటీ చేయడానికి వచ్చారని అంబటి అన్నారు.
నర్సరావుపేటలో ఆయన కుమార్తె, సత్తెనపల్లిలో ఆయన కుమారుడుతో పెత్తనం చేయాలని కోడెల కుటిలయత్నాలు చేస్తుంటాడని అంబటి విమర్శించారు.
1989లో రొంపిచర్లలో ఎన్నికల సమయంలో ఇదే విధంగా ప్రవర్తిస్తే కోడెలపై గ్రామస్తులు తిరబడి గ్రామం నుండి తరిమారని అంబటి అన్నారు.
1999లో ఆయన ఇంట్లో బాంబులు పేలి నలుగురు చనిపోతే వారికి ఏమి సహాయం చేశారా అంబటి ప్రశ్నించారు.