Jo Biden: ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ ఉగ్రవాదులు పెట్టిన బాంబు దాడులలో సామాన్య ప్రజలతో పాటు అమెరికా సైనికులు మరణించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను వేటాడి వెంటాడి మరీ చంపుతాం అని హెచ్చరించారు. కాబూల్ ఎయిర్ పోర్ట్ బాంబుదాడుల లో ఉన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. 12 మంది అమెరికా సైనికులు మరణించటం తో పాటు మొత్తం 72 మంది మృతి చెందడం జరిగింది. విమానాశ్రయంలో చుట్టుప్రక్కల మొత్తం ఆరు చోట్ల ఐసిస్ ఉగ్రవాదులు.. బాంబు దాడులతో రెచ్చిపోయారు. తామే దాడులు చేసినట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ తెలపటంతో అమెరికా అధ్యక్షుడు గట్టిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో పాటు తుపాకులతో కాబూల్ ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఉన్న ప్రయాణికులపై అదే రీతిలో అమెరికా సైనికులు ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసి దాడులు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్గనిస్థాన్ దేశంలో ప్రజాస్వామ్య దేశాన్ని నెలకొల్ప కపోతే.. రాబోయే రోజుల్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద ప్రాబల్యం పెరిగిపోతుందని అంటున్నారు.
ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దు గొడవ కాశ్మీర్ కి సంబంధించి.. తాలిబాన్ల హెల్ప్ తీసుకుంటామని కొన్ని దేశాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఇదే వాతావరణం కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కంటే ఉగ్రవాదం పెను ముప్పుగా మారే అవకాశం ఉంటుందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పటానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని చాలామంది కోరుతున్నారు.