NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

విభజన చట్టంలో 90శాతం హామీలు నెరవేర్చాం : అమిత్‌షా

రాజమండ్రి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 90శాతం హామీలను మోదీ సర్కార్ నెరవేర్చిందని భారతీ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమండ్రిలో జరిగిన శక్తి కేంద్రాల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్ జవానులు అమరులు కావడం చాలా బాధాకరమని అమిత్‌షా అన్నారు. జవానుల కుటుంబాలకు అందరం బాసటగా నిలవాలని అమిత్‌షా పేర్కొన్నారు.

ప్రధాని మోది దేశ భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారనీ, ఉగ్రదాడి తిప్పికొట్టేందుకు భారత సైనికులకు మోది పూర్తి స్వేచ్చ ఇచ్చారని షా అన్నారు.

సైనికుల మరణాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేసి బిజెపిపై బురద చల్లాలని చూస్తున్నదని అమిత్‌షా విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం వదిలి పెట్టి బెంగాల్, ఢిల్లీలకు వెళ్లి ధర్నాలు చేయడం కాదు, రాష్ట్రంలోని ఆయన పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని వంచించిన కాంగ్రెస్‌ పార్టీతో నేడు చంద్రబాబు జత కట్టారనీ, ప్రజలు ఇది చూసి ఆయన్ను అసహ్యించుకుంటున్నారని అమిత్‌షా అన్నారు.

కేంద్రంలోని మోది సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందనీ, ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఐదేళ్లలో సంపూర్ణం చేసిన విషయం తెలుగు ప్రజలు గుర్తించాలని అమిత్‌షా అన్నారు.

మోది ప్రభుత్వం రాష్ట్రానికి 20 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ఇచ్చిందని అన్నారు.

రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున సహకారం అందిస్తే నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ కేంద్రంలోని బిజెపిపై చంద్రబాబు అభాండాలు వేస్తున్నారని అమిత్‌షా విమర్శించారు.

రాజమండ్రి ఎయిర్ పోర్టు అభివృద్ధి 180కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

రాష్ట్రంలోని టిడిపి, వైసిపిలు రెండు వారి కుటుంబానికి మేలు చేసుకునే పార్టీలే కానీ ప్రజలకు మేలు చేసేవి కావని అమిత్‌షా విమర్శించారు.

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుండి 55.475కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని అమిత్‌షా స్పష్టం చేశారు.

చంద్రబాబు మోసాల చరిత్ర ప్రజలందరికీ తెలుసుననీ, ముందు మామ ఎన్‌టిఆర్, తరువాత వాజ్‌పేయి, నేడు మోదిలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అమిత్‌షా విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని అమిత్‌షా హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Leave a Comment