కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అమిత్ షా చేరిన విషయం తెల్సిందే. అమిత్ షా వరసగా అనారోగ్యానికి గురవుతుండడం కలవరానికి గురిచేస్తోంది.
ఆగష్టు 2న అమిత్ షా కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో చేరిన ఆయన కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారు. దాని తర్వాత అమిత్ షా రెండు సార్లు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. కరోనాకు ముందు కూడా అమిత్ షా అనారోగ్యానికి గురవ్వగా అప్పుడు ఆసుపత్రి నుండే విధులు నిర్వర్తించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్య నుండి కోలుకోవడంతో తిరిగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.