దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో చలి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న తరుణంలో కరోనా విలయతాండవం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఢిల్లీలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కరోనా ని ప్రభుత్వం మొన్నటివరకు కంట్రోల్ చేయగలిగింది. అయితే ఇటీవల చలికాలం రావటంతో కేసులు ఒక్కసారిగా పెరగటంతో కేంద్ర ప్రభుత్వంలో అలజడి నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి కరోనా కేసులు తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సర్కార్ పెద్దలతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సమావేశం నిర్వహించినట్లు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. కేసులు భారీగా బయటపడటంతో గతంలో మాదిరిగా పడకలు, వెంటిలేటర్ సపోర్ట్ కొరత ఎక్కువైనట్లు టాక్.
ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 80శాతం బెడ్స్ ను కరోనా రోగులకు కేటాయించాలని కేజ్రీవాల్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మందలించినా కేజ్రీ సర్కార్ పట్టించుకోవడం లేదు. గత రెండు వారాల నుంచి ఢిల్లీలో చలి పెరగటంతో పాటు దీపావళి పండుగ సందర్భంగా కాలుష్యం పెరగటంతో ఢిల్లీ లో సెకండ్ వేవ్ స్టార్ట్ కావటంతో ఢిల్లీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్పందిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో సమావేశాన్ని నిర్వహించడానికి కరోనా కట్టడి చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.