రాజమండ్రి, ఫిబ్రవరి 20 : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గురువారం ఉదయం రాజమండ్రికి విచ్చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఉభయ గోదావరి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళనం రాజమండ్రిలో గురువారం ఉదయం జరుగుతుందని అయన చెప్పారు.
ఈ సమ్మేళనానికి హజరయ్యేందుకు ఉదయం 10.30గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్షా రాజమండ్రికి చేరుకుంటారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సమ్మేళనం పూర్తి అయిన తరువాత మధ్యాహ్నం ఆయన రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో నిర్మించిన బిజెపి నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. భోజన విరామం అనంతరం తిరిగి బయలుదేరి వెళతారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?