YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్బంగా జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఆయన బేషరతుగా ఎన్డీయేలో చేరాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు చెబుతున్నారు.
అమిత్ షా ఏం చెప్పారంటే?
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం సహకారం కావాలంటే ఎన్డీయేలో చేరితీరాలని అమిత్ షా తనదైన శైలిలో జగన్ కి స్పష్టం చేశారని ఢిల్లీ నుండి వార్తలు అందుతున్నాయి.ఇందుకు ప్రతిఫలంగా వైసిపికి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఆయన ఆఫర్ చేశారంటున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇందుకు సమ్మతించారని అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి కి చెప్పారని టాక్. వచ్చే వారమే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని,ఈ టెర్ములో ఇదే ఆఖరి విస్తరణ అని,ఇప్పుడు అవకాశం మిస్తైతే ఇక దొరకబోదని అమిత్ షా చెప్పేశారట. ఈ విషయంలో ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుని తమకు తెలియచేయాలని కేంద్ర హోంమంత్రి ఆయనను కోరారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
YS Jagan: ఇరకాటంలో పడ్డ సీఎం?
అమిత్ షా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది.నిజానికి ఎన్డీయేలో చేరడానికి జగన్ సిద్ధంగా లేరు.కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి చేసిందేమీ లేదని,రాష్ర్టానికి ప్రత్యేక హోదా విషయం లో ఎన్డీయే ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని,అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులను కూడా కుదించేసారని సీఎం అసంతృప్తిగా ఉన్నారు.ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో వైసీపీ గనుక చేరినట్లయితే కేవలం కేసులు నుండి బయటపడటానికే తాను బీజేపీ ముందు మోకరిల్లానన్న అపప్రద రాగలదని సీఎం భావిస్తున్నారు.ప్రత్యేక హోదా విషయంలో ఒక అనుకూల ప్రకటన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నిధుల పెంపు వంటి ప్రకటనలు కేంద్రం గనుక చేస్తే తాను ఎన్డీయేలో చేరినా దాన్ని సమర్థించుకోవడానికి వీలుంటుందని ఆయన తలపోస్తున్నారు.కానీ మూడు రాజధానుల బిల్లు,రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తో తలనొప్పి,సీబీఐ కేసులవంటివి జగన్ మెడపై వేలాడుతున్న కత్తులని ఒక రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో జగన్ ఎన్డీయేలో చేరుకున్నా ఇబ్బందులు తప్పవన్నారు. ఎన్డీయేలో చేరితే ఒక తంటా.. లేకుంటే మరో ప్రమాదం గా మారిన ఈ పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?