న్యూఢిల్లీ: బిజెపి వ్యూహకర్త అమిత్ షా ఈసారి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేరబొతున్నారు. 2014లో బిజెపికి గెలుపు సాధించిపెట్టి, తర్వాత తాజాగా 2019 ఎన్నికలలో ఇంకా భారీ విజయానికి వ్యూహం పన్ని విజయవంతంగా అమలుచేసిన అమిత్ షాకు ఆర్ధిక శాఖ ఇచ్చే అవకాశం ఉందని హిందుస్తాన్ టైమ్స పత్రిక తెలిపింది. గత ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ నిర్వహించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య కారణాలతో ఈసారి ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు. ఆయనను పునరాలోచింపజేసేందుకు మోదీ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
అమిత్ షా మోదీకి అత్యంత సన్నిహితుడు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమిత్ షా ఆయన మంత్రివర్గంలో హోంశాఖ సహాయమంత్రిగా పవి చేశారు. ఆయన బిజెపి జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 2014లో పార్టీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు సాధించింది. తాజాగా ఇంకా ఎక్కువ సీట్లు సాధించింది. నిన్న ఈరోజు నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి కూర్చుని మంత్రివర్గం సభ్యులను ఎంపిక చేశారు.