భారతీయ సినీ చరిత్రలో ఆయనదొక సువర్ణ అధ్యాయం.. అమితాబ్ బచ్చన్.. 70వ దశకంలో లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా.. 80వ దశకంలో సూపర్ స్టార్ గా.. 90వ దశకంలో బాలీవుడ్ బిగ్ బీగా.. ఈ మిలీనియంలో నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. ఏకైక మెగాస్టార్ అమితాబ్ బచ్చనే అని చిరంజీవి అన్నారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.. తన 51 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.. మరెన్నో మార్పులకి సాక్షి గా నిలిచారు.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త ట్వీట్లకు పెట్టింది పేరు.. తనదైన రీతిలో ట్వీట్ చేస్తాడు.. న్యూ ఇయర్ 2021 గురించి అమితాబ్ చేసిన ట్వీట్ అభిమానులను అవాక్కు చేస్తుంది..! ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
కరుణ మహమ్మారి కారణంగా ప్రజల జీవితాల్లో అనేక రకాల సమస్యలు తలెత్తే విషయం అందరికీ తెలిసిందే.. అంతేకాకుండా కొద్ది మంది తీవ్ర నష్టాలను పొందితే, కొంత మంది ప్రాణాలను కూడా కోల్పోయారు.. ఈ ఏడాది వీలైనంత త్వరగా పాస్ కావాలని వచ్చే కొత్త సంవత్సరం మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.. అందుకే అమితాబచ్చన్ ట్వీట్ చేస్తూ “కృపా, కృపా, కృపా” అని ట్వీట్ రాశారు.. ఆయన 2021 లో నిమ్మ , మిర్చి చాలన్నాట్లుగా ట్వీట్ ఫొటో ఉంది. దీని పై అభిమానులు వేగంగా కామెంట్లు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
అమితాబచ్చన్ షూజిత్ సర్కార్ చిత్రం గులాబో సితాభోలో కరోనాకు మందు నటించారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా తో పాటు ఆయన కూడా ఉన్నారు ఈ చిత్రం జూన్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. త్వరలో ఆయన ఆలియా భట్, రణబీర్ కపూర్ తో పాటు కలిసి నటించిన అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపించనున్నారు.
T 3752 – कृपा कृपा कृपा !! ? pic.twitter.com/3Zws6QcVrQ
— Amitabh Bachchan (@SrBachchan) December 14, 2020