తెలుగుదేశం పార్టీ వీర విధేయుడిగా చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా ఉండే సుజనా చౌదరి 2019 ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లడం వెనకాల చంద్రబాబు హస్తం ఉందని చాలామంది అంటారు. ఆ విషయం పక్కన పెడితే, ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సుజనా చౌదరి మరియు కామినేని శ్రీనివాస్ పార్క్ హయత్ హోటల్ లో భేటీ అవ్వటం ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కొన్ని విమర్శలు మూటగట్టుకుని ఆ విషయం న్యాయస్థానంలో ఉన్న సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కలవటం పట్ల జాతీయ మీడియాలో కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా రాష్ట్ర నేతలను వివరణ కోరినట్లు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అసలు ఈ విధంగా కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నదాని విషయంలో స్పష్టత ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. ముఖ్యంగా సుజనాచౌదరి తన ప్రమేయం తోనే ఈ భేటీ జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ ను ఉద్దేశించి అమిత్ షా సీరియస్ గా ఉన్నట్లు టాక్. బీజేపీ పార్టీలో ఉండి ఎవరి ఆదేశాలను సారంగా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని జరిగిన పార్క్ హయత్ హోటల్ సమావేశంపై కామినేని శ్రీనివాస్ మరియు సుజనా చౌదరి వ్యవహారంపై ఢిల్లీ పెద్దలు అగ్గిమీదగుగ్గిలం అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నట్లు సమాచారం.
మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ విషయంపై సుజనా చౌదరి కి అదేవిధంగా కామినేని శ్రీనివాస్ కి భారీ స్థాయిలో ఢిల్లీ పెద్దల హైకమాండ్ అక్షింతలు పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. వస్తున్న వార్తలను బట్టి చంద్రబాబు డైరెక్షన్లో వీళ్లు పని చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… బిజెపి పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్లాన్లు అమలు చేయడం ఏంటి అనే దిశగా ఈ నాయకులను ఢిల్లీ బీజేపీ నేతలు చెడుగుడు ఆడటానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఇదే విషయంపై రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలు కూడా సీరియస్ అవుతున్నారట. వాళ్లంతా తెలుగుదేశం పార్టీ ఇన్ఫార్మర్ లు వాళ్లు పార్టీలో ఉండటం వల్ల పార్టీకి డ్యామేజీ తప్ప లాభం ఉండదని లోలోపల చర్చించుకుంటున్నారట.